వైఎస్సార్ జిల్లాలో టీడీపీకి షాక్ తగిలింది. కమలాపురం మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత వీరశివారెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. త్వరలో సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతానని ప్రకటించారు. చంద్రబాబు డబ్బులున్న వారికే టికెట్లు ఇస్తారని, ప్రజాదరణ ఉన్నవారిని పట్టించుకోరని ఆయన విమర్శించారు. వీరశివారెడ్డి టీడీపీ నుంచి కమలాపురం అసెంబ్లీ లేదా కడప ఎంపీ టికెట్ ఆశించగా మొండిచేయి ఎదురైంది.