ప్రజలు ఈజీ మనీకి ఎక్కువగా ఆశపడుతుండటంతో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. రోజుకొక కొత్త ఎత్తుగడతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఒక్క తెలంగాణ నుంచే రోజుకు రూ.5 కోట్ల చొప్పున ఏడాదికి సుమారు రూ.1,800 కోట్ల డబ్బును దోచేస్తున్నారు. ఈ ఏడాది 3 నెలల్లో నమోదైన టాప్-5 సైబర్ నేరాల్లో బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ టాప్లో ఉన్నది. సాంకేతిక వినియోగం అధికంగా ఉన్న తెలంగాణలో ఈ నేరాలు జరగడం ఆందోళనకరం.