తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో నివేదికల ప్రకారం 2023లో రాష్ట్రంలో జరిగిన 16,339 సైబర్ నేరాల్లో 15 వేల వరకు ఆర్థిక మోసాలే కావడం గమనార్హం. దేశవ్యాప్తంగా జరుగుతోన్న మొత్తం సైబర్ నేరాల్లో తెలంగాణలోనే 40 శాతానికిపైగా ఉండడం రాష్ట్రంపై సైబర నేరస్థుల పంజా ఎలా ఉందో అర్థమవుతోంది. బిజినెస్ ఇన్వెస్ట్మెంట్, ఓటీపీ, ఓఎల్ఎక్స్, కొరియర్, సెక్స్టార్షన్ తరహా మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి.