టెక్నాలజీ పెరిగే కొద్దీ సైబర్ నేరగాళ్లు కొత్త పంథా ఎంచుకుంటున్నారు. వివిధ పద్దతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఆన్ లైన్ ట్రేడింగ్ పేరిట కోట్లు కొట్టేసిన ముఠాను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తక్కువ ఇన్వెస్ట్ మెంట్ పెట్టి ఎక్కువ లాభాలు పొందవచ్చని కేటుగాళ్లు వేసిన వలలో చిక్కి చాలా మంది భారీగా మోసపోయారు. వారికి చిక్కిన హైదరాబాద్ వాసి రూ.9 లక్షలకు పైగా మోసపోయాడు.