దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 220.05 పాయింట్లు క్షీణించి 75,170.45 వద్ద, నిఫ్టీ 44.30 పాయింట్లు నష్టపోయి 22,888.20 వద్ద ఉన్నాయి. నిఫ్టీలో దివీస్ లాబ్, SBI లైఫ్, HDFC లైఫ్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, హీరో మోటోకార్ప్ లాభపడగా అదానీ పోర్ట్స్, పవర్ గ్రిడ్ కార్ప్, కోల్ ఇండియా, అదానీ ఎంటర్ప్రైజెస్ నష్టపోయాయి. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ 83.18 వద్ద ముగిసింది.