ఛత్తీస్‌గఢ్‌లో వందేభారత్ రైలుపై రాళ్ల దాడి, ఐదుగురు అరెస్ట్

55చూసినవారు
ఛత్తీస్‌గఢ్‌లో వందేభారత్ రైలుపై రాళ్ల దాడి, ఐదుగురు అరెస్ట్
ఛత్తీస్‌గఢ్‌లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుపై రాళ్లదాడి జరిగింది. మహాసముంద్‌లోని బాగ్‌బహ్రా రైల్వే స్టేషన్ సమీపంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ట్రయల్ రన్ చేస్తుండగా.. దుండగులు రైలుపై రాళ్లు రువ్వడంతో మూడు కోచ్‌ల అద్దాలు పగిలిపోయాయి. దీంతో వెంటనే రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. రైల్వే చట్టంలోని సెక్షన్ 153 కింద కేసు నమోదు చేసి ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. అరెస్టయిన నిందితుల్లో ఒకరు కౌన్సిలర్ సోదరుడు అని పోలీసులు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్