మద్యం మత్తులో ఆటో డ్రైవింగ్.. విద్యార్థిని మృతి

546చూసినవారు
మద్యం మత్తులో ఆటో డ్రైవింగ్.. విద్యార్థిని మృతి
ఆటో ఢీకొని కళాశాల విద్యార్థిని మృతి చెందిన సంఘటన బెళగావి జిల్లా చెన్నమ్మ కిత్తూరు పట్టణంలో చోటుచేసుకుంది. కిత్తూరు డిగ్రీ కళాశాలలో 3వ సెమిస్టర్ చదువుతున్న కావేరి బసప్ప(20) కళాశాల ముగించుకుని కావేరి ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా వేగంగా వచ్చిన ఆటో ఢీకొనడంతో మృతి చెందింది. వాహనం నడుపుతున్న డ్రైవర్ అనిల్ మద్యం మత్తులో నిర్లక్ష్యంగా వాహనం నడిపి యువతి ప్రాణం తీశాడు. నిందితుడిని అరెస్టు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్