విద్యార్థులు 22న తరగతులను బహిష్కరించాలి: ఆర్.కృష్ణయ్య

70చూసినవారు
విద్యార్థులు 22న తరగతులను బహిష్కరించాలి: ఆర్.కృష్ణయ్య
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు ఈనెల 22న తరగతులను బహిష్కరించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించాలని, స్కాలర్షిప్ రూ.5,500 నుంచి రూ.10వేలకు పెంచాలనే డిమాండ్ తో కలెక్టరేట్లు, MRO ఆఫీసులను ముట్టడించాలని ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా డిగ్రీ కాలేజీలను నిరవధికంగా బంద్ చేయాలనే నిర్ణయాన్ని యాజమాన్యాలు ఉపసంహరించుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్