తన చావుకు సీఐ, ఎస్ఐ కారణమంటూ సూసైడ్ నోట్.. వ్యక్తి అదృశ్యం

66907చూసినవారు
తన చావుకు CI, SI కారణమంటూ సూసైడ్ నోట్ రాసి ఓ వ్యక్తి అదృశ్యమైన ఘటన హన్మకొండ జిల్లాలో జరిగింది. పోలీసులు తనని కొట్టారని, తన చావుకు హసన్ పర్తి సీఐ, ఎస్ఐ కారణమని శ్యాంరావ్ ప్రశాంత్ కుమార్ అనే వ్యక్తి సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు. తన దగ్గర అప్పు తీసుకున్నవారు వేధిస్తున్నారని పోలీసులను ఆశ్రయిస్తే.. వారు తనను కొట్టారని ఆరోపించాడు. తన భర్తను కాపాడి, పోలీసులపై చర్యలు తీసుకోవాలని సీపీకి భాదితుడి భార్య శ్యామల ఫిర్యాదు చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్