హీరోయిన్ తమన్నాకు సమన్లు

544చూసినవారు
హీరోయిన్ తమన్నాకు సమన్లు
ప్రముఖ నటి తమన్నా భాటియా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చిక్కుల్లో పడింది. మహారాష్ట్ర సైబర్ విభాగం తమన్నాకు సమన్లు జారీ చేసింది. ఐపీఎల్ 2023 మ్యాచ్‌లను అక్రమంగా ‘ఫెయిర్ ప్లే’ యాప్‌లో ప్రదర్శించిన కేసులో ఆమెను ప్రశ్నించేందుకు ఈ నోటీసులు ఇచ్చింది. దీంతో ‘వయాకామ్’ మీడియాకు రూ.కోట్ల నష్టం జరిగిందని తెలిపింది. ఈ మేరకు తమన్నాను ఈ నెల 29న విచారణకు హాజరుకావాలని మహారాష్ట్ర సైబర్ విభాగం కోరింది.

సంబంధిత పోస్ట్