అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం జనవరి 22న మధ్యాహ్నం 12.20 గంటలకు జరుగనుంది. ఈ నేపథ్యంలో తాజాగా తమిళ సూపర్స్టార్ రజనీకాంత్కు అయోధ్య నుంచి ఆహ్వానం అందింది. ప్రముఖ
బీజేపీ నాయకుడు అర్జున మూర్తి రజనీకాంత్ ఇంటికి వెళ్లి రామ మందిర ప్రారంభోత్సవానికి రావాలని సూపర్స్టార్ను ఆహ్వానించారు. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.