మణిపూర్ రాష్ట్ర అధికారులపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫైల్స్, క్షయ వ్యాధి, తీవ్రమైన వెన్ను నొప్పితో బాధపడుతున్న లుంఖోంగమ్ హాకిప్ అనే కుకీ వర్గానికి చెందిన ఖైదీని అధికారులు ఆస్పత్రికి తీసుకెళ్లలేదు. దీంతో ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన న్యాయమూర్తులు ఖైదీకి వైద్యం అందించనందుకు అధికారులపై సీరియస్ అయ్యారు. తక్షణమే హకీప్కు వైద్యం అందించాలని ఆదేశించారు.