సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ అనిరుద్ధ బోస్ నేడు పదవీ విరమణ చేయనున్నారు. 2019 మే 24న సుప్రీంకోర్టు జడ్జిగా బాధ్యతలను స్వీకరించిన ఆయన దాదాపు ఐదేళ్ల పాటు ఆ పదవిలో ఉన్నారు. బోస్ కోల్కతాలోని సెయింట్ లారెన్స్ హైస్కూల్లో పాఠశాల విద్యను అభ్యసించారు. కోల్కతాలోని సెయింట్ జేవియర్స్ కాలేజీ నుంచి బీ.కాంలో పట్టభద్రుడయ్యారు. అనంతరం సురేంద్రనాథ్ లా కాలేజీలో బ్యాచిలర్ ఆఫ్ లాస్ పూర్తి చేశారు.