మంత్రి ఉదయనిధిని మందలించిన సుప్రీంకోర్టు

82చూసినవారు
మంత్రి ఉదయనిధిని మందలించిన సుప్రీంకోర్టు
సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ను సుప్రీం కోర్టు మందలించింది. 'మీరేం సామాన్య పౌరుడు కాదు. ఓ మంత్రి పదవిలో ఉండి అలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో మీకు తెలియదా? రాజ్యాంగం కల్పించిన హక్కులను మీరు దుర్వినియోగం చేశారు' అని ఆగ్రహం వ్యక్తం చేసింది. అనంతరం తదుపరి విచారణను ఈనెల 15కు వాయిదా వేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్