ఎన్నికల వేళ సుప్రీం కీలక నిర్ణయం

71చూసినవారు
ఎన్నికల వేళ సుప్రీం కీలక నిర్ణయం
సార్వత్రిక ఎన్నికలకు తొలి నోటిఫికేషన్ విడుదలైన రోజే కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఉచిత హామీలు ఇస్తున్న తీరుపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. త్వరలోనే దీన్ని లిస్ట్ చేస్తామని పేర్కొంది. రాజకీయ పార్టీలు ఇచ్చే వాగ్దానాలపై చర్యలు తీసుకునేలా ఈసీని ఆదేశించాలంటూ న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్ సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు.

సంబంధిత పోస్ట్