తమ్మరలో కాంగ్రెస్ ముమ్మర ప్రచారం
కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి గెలుపుతోనే నల్గొండ పార్లమెంట్ అభివృద్ధి సాధ్యం అవుతుందని కోదాడ పిఏసీఎస్ ఛైర్మన్ ఓరుగంటి శ్రీనివాస్ రెడ్డి, వైస్ ఛైర్మన్ బుడిగం నరేష్ లు అన్నారు. బుధవారం కోదాడపరిధిలోని తమ్మర లో ఎమ్మెల్యే పద్మావతి, మంత్రి ఉత్తమ్ ఆదేశాల మేరకు గడప, గడపకు ప్రచారం నిర్వహించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తమ్మర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సొందుమియా, మాజీ పిఏసీఏస్ చైర్మన్ అనంత రాములు ఉన్నారు.