పశువుల ను బయటకి కొట్టడానికి వెళ్లి చెరువులో పడి వ్యక్తి మృతి

44532చూసినవారు
పశువుల ను బయటకి కొట్టడానికి వెళ్లి చెరువులో పడి వ్యక్తి మృతి
సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం ధర్మ పురం గ్రామంలో చెరువులో పడి ఎడ్ల ముత్తయ్య (55) మృతి చెందారు. బుధవారం సాయంత్రం పశువులని చెరువులో నుండి బయటికి వెళ్లగొట్టడానికి దిగి ప్రమాదవశాత్తు చెరువులో మునిగి మృతి చెందారు. గురువారం ఉదయం 11 గంటలకు చెరువులో మృతదేహం లభ్యమైంది. స్థానికులు మృతదేహాన్ని బయటకి తీసి బంధువులకు అప్పగించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్