సూర్యాపేట జిల్లా కేంద్రంలో దంచి కొడుతున్న ఎండ తీవ్రతలు

76చూసినవారు
సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఎండలు దంచి కొడుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచి తీవ్ర ఎండలు కొడుతున్నాయి. మధ్యాహ్నం రెండు గంటల వరకు 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇంట్లో నుంచి బయటికి రావాలంటేనే వృద్ధులు చిన్నారులు భయపడిపోతున్నారు. ఎండ వేడి నుండి ఉపశమనం పొందేందుకు కొబ్బరి బోండాలు శీతల పానీయాలు సేవిస్తున్నారు. తప్పనిసరి అయితేనే మధ్యాహ్నం బయటికి రావాలని సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్