తిరుమలగిరి మార్కెట్ కు పెరిగిన ధాన్యం..

550చూసినవారు
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలో గల వ్యవసాయ మార్కెట్ యార్డుకు సోమవారం రోజు 20485 బస్తాల ధాన్యం వచ్చినట్లు మార్కెట్ కార్యదర్శి శ్రీధర్ వెల్లడించారు. గరిష్టంగా క్వింటాకు 1997, కనిష్టంగా 1620, ధర పలికినట్లు వెల్లడించారు. అత్యధికంగా ధాన్యం వచ్చిన కారణంగా కాంటాలు ఆలస్యం అవుతుండడంతో మార్కెట్ యార్డ్ కు మంగళవారం సెలవు ప్రకటించారు. తిరిగి మూడో తేదీన మార్కెట్ యధావిధిగా పనిచేస్తుందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్