ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కి ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలీవాల్ మంగళవారం లేఖ రాశారు. లేఖలో ఢిల్లీ మహిళా కమిషన్ ఎదుర్కొంటున్న ప్రస్తుత సవాళ్లను ఆమె ఎత్తి చూపారు. తాను గత జనవరిలో ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ పదవికి రాజీనామా చేసినప్పటి నుంచి ఆప్ ప్రభుత్వం డీసీడబ్ల్యూని పట్టించుకోవడం లేదని, మెల్లమెల్లగా అణచివేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపణలు చేశారు.