టీ20 వరల్డ్ కప్లో భాగంగా కెనడాతో భారత క్రికెట్ జట్టు శనివారం తలపడనుంది. ఫ్లోరిడాలోని సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్క్ స్టేడియంలో రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్కు వర్షం ముప్పు పొంచి ఉంది. ఈ మ్యాచ్లోనైనా కోహ్లి, రోహిత్ ఫామ్లోకి రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. గ్రూప్-A నుంచి భారత్, US జట్లు ఇప్పటికే సూపర్-8 బెర్త్ను ఖరారు చేసుకోగా, పాక్ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది.