ధర్మశాల వేదికగా ఇంగ్లాండ్తో మ్యాచ్లో భారత్ దూసుకుపోతోంది. టీ సమయానికి ఇండియా 376/3 పరుగులు చేసింది. దీంతో ఇప్పటికి తొలి ఇన్నింగ్స్లో భారత్ 158 పరుగుల ఆధిక్యం సాధించింది. ప్రస్తుతం క్రీజులో సర్ఫరాజ్ 56*, పడిక్కల్ 44* ఉన్నారు. రోహిత్ శర్మ 103, జైశ్వాల్ 57, గిల్ 110 పరుగులు చేసి ఔటయ్యారు. కాగా ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 218 పరుగులకు ఆలౌట్ అయింది.