3-1 తేడాతో ఇంగ్లాండ్పై టెస్ట్ సిరీస్ను గెలుచుకున్న టీమిండియా ఇక ఆఖరి టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. ఈ నెల 7న ధర్మశాలలోని HPCA స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. ఈ క్రమంలో భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ మొదలుపెట్టారు. కెప్టెన్ రోహిత్, యువ సంచలనం జైస్వాల్, గిల్ నెట్స్లో చెమటోడ్చుతూ కనిపించారు. మరో వైపు ఇంగ్లాండ్ ప్లేయర్లు కూడా ప్రాక్టీస్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.