గత రెండు నెలలుగా ఉర్రూతలూగించిన ఐపీఎల్ సమరం ముగిసింది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్ జట్టు ఐపీఎల్ టైటిల్ను గెలుచుకుంది. ఇక ఐపీఎల్ 2024 ముగిసిందో లేదో.. మరో మెగా క్రికెట్ టోర్నీ అభిమానులను అలరించేందుకు సిద్ధమైంది. టీ 20 వరల్డ్ కప్ 2024 మరో ఐదు రోజుల్లో ప్రారంభం కాబోతున్న విషయం తెలిసిందే. ఈ వరల్డ్ కప్ కోసం టీమ్ ఇండియా జట్టు తాజాగా న్యూయార్క్ చేరుకుంది.