బంగ్లాతో తొలి టెస్టులో టీమ్​ ఇండియా 376 పరుగులకు ఆలౌట్

54చూసినవారు
బంగ్లాతో తొలి టెస్టులో టీమ్​ ఇండియా 376 పరుగులకు ఆలౌట్
చెన్నైలోని చెపాక్ వేదిక‌గా బంగ్లాదేశ్‌తో జ‌రుగుతున్న మొద‌టి టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 376 పరుగులకు ఆలౌటైంది. మ్యాచ్ రెండో రోజైన శుక్రవారం 339/6 స్కోరుతో ఆట ప్రారంభించిన టీమిండియా 37 పరుగులకే చివరి 4 వికెట్లు కోల్పోయింది. వీరిలో తస్కిన్ అహ్మద్ 3 వికెట్లు తీశాడు. రవిచంద్రన్ అశ్విన్ (113), రవీంద్ర జడేజా (86), యశస్వి జైస్వాల్ (56), రిషభ్‌ పంత్ (39)తో అద్భుతంగా రాణించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్