తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఇరిగేషన్ శాఖపై సభలో మంత్రి ఉత్తమ్ శ్వేతపత్రం ప్రవేశపెట్టనున్నారు. అసెంబ్లీలో నేడు ఓటాన్ అకౌంట్ బడ్జెట్పై చర్చ జరుగుతోంది. ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క సమాధానం ఇస్తారు. ద్రవ్య వినిమయ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలపనుంది. మేడిగడ్డ విజిలెన్స్ రిపోర్ట్, కాగ్ రిపోర్ట్ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఇక ఇరిగేషన్పై చర్చకు రావాలని కేసీఆర్కు సీఎం రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు.