హర్యానాలో ఉద్రిక్తత.. రైతుల ర్యాలీ అడ్డగింత (Video)

526చూసినవారు
పంజాబ్ సరిహద్దులోని ఖనౌరీలో నిలిచిపోయిన రైతులకు మద్దతు తెలిపేందుకు హర్యానా నుంచి పెద్దఎత్తున బయల్దేరిన అన్నదాతలను పోలీసులు అడ్డుకోవడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఖేడీ చోప్టా వద్ద కొంతమంది ఆందోళనకారులు పోలీసు సిబ్బందిపై రాళ్లు రువ్వారు. దీంతో రైతులను నిలువరించేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ ఘటనలో పలువురు భద్రత సిబ్బందికి గాయాలయ్యాయి. కొంతమంది ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్