తీవ్ర విషాదం.. పిడుగు పాటుకు ముగ్గురు మృతి

26680చూసినవారు
తీవ్ర విషాదం.. పిడుగు పాటుకు ముగ్గురు మృతి
వికారాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. యాలాల్ మండల పరిధిలోని వేర్వేరు ప్రాంతాల్లో పిడుగుపడి ఇవాళ ముగ్గురు మృతి చెందారు. మండల పరిధిలోని బంటుపల్లిలో ఇద్దరు, బెన్నూర్‌లో ఒకరు చనిపోయారు. మృతులను ఎంకప్ప (60), లక్ష్మప్ప (49), శ్రీనివాస్ (28)గా గుర్తించారు. పిడుగు పాటుకు గురై మరో మహిళకు తీవ్ర గాయాలు అయ్యాయి. పోలీసులు వివరాలు ఆరా తీస్తున్నారు. భారీ వర్షాలకు బయటకు వెళ్లొద్దని ప్రజలకు నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్