జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రదాడి.. మరో కార్మికునికి తీవ్రగాయాలు

74చూసినవారు
జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రదాడి.. మరో కార్మికునికి తీవ్రగాయాలు
జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పుల్వామా జిల్లాలో గల ట్రాల్ ప్రాంతంలో గురువారం ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రీతమ్ సింగ్‌ అనే కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతన్ని ఆర్మీ అధికారులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు ఉగ్రవాదులు కాశ్మీరేతరులను లక్ష్యంగా చేసుకొని దాడులు జరిపారు. గత వారం రోజులుగా కాశ్మీర్‌లో స్థానికేతర కార్మికులపై దాడులు జరుగుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్