తెలంగాణ పనిచేస్తున్న ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు షెడ్యూల్ రిలీజ్ అయింది. శనివారం నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానుందని రాష్ట్ర సర్కారు ఒక ప్రకటనలో తెలిపింది. మూడేళ్లలోపు పదవీ విరమణ చేయాల్సిన టీచర్లకు తప్పనిసరి బదిలీ నుంచి మినహాయింపు లభించింది. మల్టీ జోన్ 1లో శనివారం నుంచి ఈ నెల 22 వరకు, మల్టీ జోన్ 2లో జూన్ 30 వరకు బదీలీలు, పదోన్నతుల ప్రక్రియ కొనసాగనుంది.