AP: ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయంపై టీడీపీ నేత వర్ల రామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. "మాజీ సీఎం వైఎస్ జగన్ వైఖరి వల్లే ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. జగన్ చేసిన అరాచకాలే ఆ పార్టీని నాశనం చేశాయి. బటన్లు నొక్కినంత మాత్రాన మీరు చేసిన నేరాలు-ఘోరాలు ప్రజలు మర్చిపోరు. అందుకే ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పారు. ఓటమిపై ఆత్మపరిశీలన చేసుకోకుండా ప్రజలపై నిందలు వేస్తున్నారు." అని వర్ల రామయ్య మండిపడ్డారు.