అమ్మ మరణించిన సమయంలో తనపై కొందరు నెగిటివ్ కామెంట్స్ చేశారని జాన్వీకపూర్ బాధపడ్డారు. ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘అమ్మ మరణం నన్ను ప్రభావితం చేయలేదని చాలా మంది అనుకున్నారు. అది నిజం కాదు. ఆమె చనిపోయిన తర్వాత ఆ బాధ నుంచి బయటకు రావాలనే నేను పనిపై దృష్టిపెట్టాను’’ అని చెప్పారు.