బీహార్లోని ఛప్రాలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. బుధవారం ఉదయం తండ్రీకొడుకులు కలిసి బైక్పై జిల్లా కోర్టుకు బయలుదేరారు. మార్గమధ్యలో కాపుకాసిన దుండగులు వారిపై కాల్పులు జరిపారు. సంఘటనలో తండ్రీకుమారులు మరణించారు. వీరి మృతిపై న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. కాల్పులు జరిపిన నేరగాళ్లను పోలీసులు అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.