తెలంగాణలోని అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. హాసన్ నగర్లో గురువారం ఉదయం టీ పెట్టి ఇవ్వనందుకు ఓ అత్త తన కోడలును చంపేసింది. కోడలు అజ్మీర బేగం(28)ని టీ పెట్టమని చెప్పగా ఆమె నిరాకరించింది. దీంతో క్షణికావేశానికి గురైన అత్త జన చున్నీతో కోడలు మెడకు బిగించి ఉరివేసి చంపేసింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు నిందితురాలిని అరెస్టు చేశారు.