మహారాష్ట్రలోని కొల్హాపూర్ పరిధి షాహుపురిలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. రోడ్డుపై వచ్చే వాహనాలను పట్టించుకోకుండా ఓ ఆటోరిక్షా డ్రైవర్ యూ టర్న్ తీసుకున్నాడు. ఆ సమయంలో ఓ బైక్ను ఆటో ఢీకొట్టింది. దీంతో ఆటోడ్రైవర్ కింద పడిపోయాడు. తర్వాత డ్రైవర్ లేకపోయినా ఆటో ఆగకుండా మరో ఇద్దరిని ఢీకొట్టింది. సకాలంలో ఆటోను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో మొత్తం ఐదుగురికి గాయాలయ్యాయి.