మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లా ధామ్నోద్ పోలీస్ స్టేషన్ పరిధిలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. కచ్వానియా గ్రామానికి చెందిన యువతికి మే 20న ఓ యువకుడితో వివాహం జరిగింది. అయితే మే 22న తెల్లవారుజామున 4 గంటలకు ఆమె కుమార్తెకు జన్మనిచ్చింది. దీంతో అత్తమామలు షాక్ అయ్యారు. ఆరా తీయగా ఆమె గతేడాది బంధువుల ఇంటికి వెళ్లినప్పుడు పొలంలో సునీల్ బాఘేల్ అనే వ్యక్తి అత్యాచారం చేశాడని విచారణలో తేలింది.