భారతదేశంలో ఆది దంపతులైన శివపార్వతీదేవి ఆలయాలు చాలా ఉన్నాయి. అయితే ఎక్కువగా శివాలయాలు కొండల్లో ఉంటాయి. ఒడిశాలో టిట్లాగడ్ జిల్లాలోని కుంహద పర్వతంపై ఓ పురాతన శివాలయం ఉంది. అయితే, సాధారణంగానే ఈ పర్వతంపై విపరీతమైన వేడి ఉంటుంది. కానీ, ఈ ఆలయం లోపల మాత్రం చాలా చలిగా ఉంటుంది. ఆలయ బయట వేడి పెరిగే కొద్దీ గుడి లోపల ఉష్ణోగ్రత తగ్గుతుంది. అయితే, ఇలా ఎందుకు జరుగుతుందో.. దైవం మహిమా లేక ప్రకృతి అద్భుతమా అనేది ఎవరికీ తెలియదు.