సీమా హైదర్ తను ప్రేమించిన సచిన్ కోసం గతేడాది మేలో పాకిస్తాన్ నుంచి ఇండియాకి సరైన పత్రాలు లేకుండానే వచ్చారు. ఈ నేపథ్యంలో ఆమె మొదటి భర్త, పాకిస్తాన్కు చెందిన గులామ్ హైదర్ విడాకులు కోరుతూ నోయిడా కుటుంబ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. గులామ్ హైదర్ పిటిషన్ను విచారణకు స్వీకరించిన కోర్టు.. 2024 మే 27న కోర్టు ముందు హాజరు కావాల్సిందిగా సీమా హైదర్కు సమన్లు జారీ చేసింది.