తమిళనాడులోని కోయంబత్తూరులోని పొల్లాచ్చి పట్టణంలో ఓ ఏనుగు దూడ కాలువలో పడిపోయింది. పిల్ల ఏనుగును రక్షించడానికి తల్లి ఏనుగు ఎన్నో విధాలుగా ప్రయత్నించినా అది సాధ్యంకాక తల్లడిల్లి పోతుంది. దీన్ని గమనించిన ఫారెస్ట్ అధికారులు వెంటనే రంగంలోకి దిగి, కాలువలో పడిపోయిన ఏనుగు పిల్లలను రక్షించి.. ఆ తర్వాత తన తల్లి దగ్గరకు పంపించారు. దీంతో ఫారెస్ట్ అధికారుల బృందానికి తల్లి ఏనుగు తొండంపైకి ఎత్తి థాంక్స్ చెప్పింది. ప్రస్తుతం వీడియో నెట్టింట వైరల్గా మారింది.