తొలి దశ పోలింగ్‌.. ఆ రాష్ట్రాలకు డబుల్ ధమాకా!

82చూసినవారు
తొలి దశ పోలింగ్‌.. ఆ రాష్ట్రాలకు డబుల్ ధమాకా!
అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో లోక్‌సభ తొలి విడత ఎన్నికలతో పాటు నేడు అసెంబ్లీ ఎన్నికలూ జరగనున్నాయి. అరుణాచల్‌ప్రదేశ్‌లో 60 అసెంబ్లీ స్థానాలు ఉండగా 10 చోట్ల బీజేపీ అభ్యర్థులు ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 50 సీట్లకు నేడు పోలింగ్ జరగనుండగా, 133 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అలాగే సిక్కింలో 32 స్థానాలకు పోలింగ్ జరగనుండగా, 146 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

సంబంధిత పోస్ట్