నాలుగో విడత పోలింగ్ ప్రారంభం అయింది. నాల్గోవిడతలో10 రాష్ట్రాలు, కేంద్రపాలితప్రాంతాల పరిధిలోని 96 లోక్సభ స్థానాల్లో ఇవాళ ఓటింగ్ జరగనుంది. ఆంధ్రప్రదేశ్లో 25, తెలంగాణలో 17, యూపీ లో 13, మహారాష్ట్రలో 11, మధ్యప్రదేశ్, పశ్చిమ బంగాల్లో 8 చొప్పున, బిహార్లో 5, ఒడిశా, ఝార్ఖండ్లో 4 చొప్పున, జమ్ముకశ్మీర్లో ఒక లోక్సభ నియోజకవర్గంలో పోలింగ్ ప్రారంభమైంది. ఓట్లు వేసేందుకు ఉదయాన్నే ఓటర్లు క్యూ కట్టారు.