బాలికపై సామూహిక అత్యాచారం.. తలపై ఇటుకతో కొట్టిన నిందితులు

76చూసినవారు
బాలికపై సామూహిక అత్యాచారం.. తలపై ఇటుకతో కొట్టిన నిందితులు
యూపీలోని లక్నో నగరం బక్షి కా తలాబ్ ప్రాంతంలో ఆదివారం దారుణం జరిగింది. 14 ఏళ్ల బాలిక దుకాణానికి వెళ్తుండగా ఆమెను ఇద్దరు నిందితులు నిర్మానుష్య ప్రాంతానికి లాక్కెళ్లారు. అనంతరం సామూహిక అత్యాచారం చేశారు. తర్వాత ఆమె తలపై ఇటుకతో కొట్టారు. వారి నుంచి తప్పించుకుని ఇంటికి చేరుకున్న బాలిక తన తల్లిదండ్రులకు విషయం తెలిపింది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్