బాలికను కిడ్నాప్‌ చేసి.. కదులుతున్న కారులో అత్యాచారం

51చూసినవారు
బాలికను కిడ్నాప్‌ చేసి.. కదులుతున్న కారులో అత్యాచారం
ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లాలో ఆగస్టు 20న జరిగిన ఓ షాకింగ్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 16 ఏళ్ల బాలిక మలవిసర్జన కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లింది. ఇంతలో ముగ్గురు వ్యక్తులు బాలికను కిడ్నాప్‌ చేశారు. బలవంతంగా కారులోకి ఎక్కించి హైవే పై వెళ్తూ.. కదులుతున్న కారులోనే ఆ బాలికపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు ఒక వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. మిగతా వారి కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్