కువైట్లో కష్టాలు పడుతున్న శివ అనే కార్మికుడిని ఇండియన్ ఎంబసీ కాపాడింది. అతడిని త్వరలోనే రాష్ట్రానికి తీసుకొస్తామని ఏపీ మంత్రి లోకేశ్ అన్నారు. కువైట్లో కష్టాలపై అతడు ఎక్స్లో పెట్టిన వీడియోపై లోకేశ్ స్పందించిన సంగతి తెలిసిందే. వెంటనే ఆ విషయంపై దృష్టి పెట్టాలని టీడీసీ ఎన్నారై బృందానికి లోకేశ్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సాయంతో శివను త్వరలోనే ఏపీకి తీసుకొస్తామన్నారు.