బాలికను చంపి తిన్న చిరుత.. గ్రామస్తులు ఏం చేశారంటే

68చూసినవారు
బాలికను చంపి తిన్న చిరుత.. గ్రామస్తులు ఏం చేశారంటే
ఉత్తరాఖండ్లో ఓ చిన్నారిని చిరుత బలి తీసుకుంది. హిందావ్ పట్టిలోని భౌద్ గ్రామానికి చెందిన రుకం సింగ్ కుమార్తె పూనమ్(9).. తన ఇంటి ఆవరణలో ఆడుకుంటుండగా చిరుత పులి దాడి చేసి చంపి తిన్నది. పూనమ్ ఇంట్లో కనిపించకపోవడంతో..గ్రామస్తులు చుట్టుపక్కల గాలించగా ఇంటికి సమీపంలోని పొదల్లో సగం తిన్న బాలిక మృతదేహం లభ్యమైంది. దీంతో.. ప్రజలు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. కాగా గ్రామంలో బోన్లు ఏర్పాటు చేసి చిరుతను పట్టుకుంటామని రేంజర్ ఆశిష్ నౌటియాల్ తెలిపారు.

సంబంధిత పోస్ట్