ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని ప్రజాభవన్లో ముఖాముఖి భేటీ అయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పెండింగ్లో ఉన్న విభజన అంశాలపై ఇరువురు నేతలు చర్చలు జరుపుతున్నారు. ఈ భేటీలో రెండు రాష్ట్రాల సీఎస్లు, ఏపీ మంత్రులు సత్యప్రసాద్, బీసీ జనార్దన్రెడ్డి, కందుల దుర్గేష్, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ తదితరులు చర్చల్లో పాల్గొన్నారు.