పుణె మెట్రోస్టేషన్లో శుక్రవారం షాకింగ్ ఘటన జరిగింది. మెట్రో స్టేషన్లో మూడేళ్ల బాలుడు ఆడుకుంటూ పొరపాటున ట్రాక్పై పడ్డాడు. బాలుడిని రక్షించే క్రమంలో అతడి తల్లి కూడా ట్రాక్పై పడింది. డ్యూటీలో ఉన్న సెక్యూరిటీ గార్డు వికాస్ బంగర్ వెంటనే ఎమర్జెన్సీ మెట్రో స్టాప్ ప్లంగర్ (ESP) బటన్ను నొక్కాడు. దీంతో ఇరువైపులా వచ్చే మెట్రో రైళ్లు ఆగిపోయాయి. అనంతరం తల్లిని, బాలుడిని ప్లాట్ఫారం పైకి చేర్చారు.