ప్రముఖ ఈ కామర్స్ సైట్ ఫ్లిప్కార్ట్ మొబైల్ ఫోన్స్పై భారీ డిస్కౌంట్స్ అందిస్తోంది. ఈ నేపథ్యంలోనే మంత్ ఎండ్ మొబైల్ ఫెస్ట్ డీల్ను ప్రకటించింది. ఈ మేరకు కొన్ని ఫోన్లపై ఆఫర్లను ప్రకటించింది. వాటిలో సామ్సంగ్ గ్యాలక్సీ F15 స్మార్ట్ ఫోన్పై రూ.5000 డిస్కౌంట్ను అందిస్తోంది. రియల్మీ P1 5జీ స్మార్ట్ ఫోన్పై 5 శాతం డిస్కౌంట్ను అందిస్తున్నారు. దీంతో రూ. 20వేలకే సొంతం చేసుకోవచ్చు. అలాగే నథింగ్ ఫోన్ 2A అసలు ధర రూ. 25,999 ఉండగా ఆఫర్లో రూ. 21,999కే పొందవచ్చు.