స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ) 1,765 జూనియర్ ఇంజినీర్ ఉద్యోగాల భర్తీకి జూన్ 5, 6, 7 తేదీల్లో నిర్వహించిన పేపర్-1 పరీక్ష ఫలితాలు వెల్లడయ్యాయి. సివిల్, ఎలక్ట్రికల్/మెకానికల్ ఇంజినీరింగ్ విభాగాల్లో కలిపి మొత్తం 16,223 మంది అభ్యర్థులు పేపర్-2 రాసేందుకు అర్హత సాధించినట్లు ఎస్ఎస్సీ తెలిపింది. అభ్యర్థులు ssc.gov.in వెబ్సైట్లో ఫలితాలు తెలుసుకోవచ్చు.