కన్నతల్లిని చంపేసి ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టిన కొడుకు

53చూసినవారు
కన్నతల్లిని చంపేసి ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టిన కొడుకు
గుజరాత్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. రాజ్‌కోట్‌లోని యూనివర్సిటీ రోడ్‌లో భగత్‌సింగ్‌జీ గార్డెన్‌లో నీలేశ్‌ గోసాయ్‌ అనే యువకుడు తల్లి జ్యోతిబెన్‌ గోసాయ్‌ (48)తో కలిసి నివసిస్తున్నాడు. ఏదో విషయమై తల్లితో గొడవపడి, ఆమె గొంతు నులిమి హత్య చేశాడు. ఆ తర్వాత ‘సారీ అమ్మ.. నిన్ను చంపేశా.. నిన్ను మిస్‌ అవుతున్నాను.. నా జీవితాన్ని కోల్పోయాను.. ఓం శాంతి’ అని ఇన్‌స్టాలో పోస్టులు పెట్టాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్