గుజరాత్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. రాజ్కోట్లోని యూనివర్సిటీ రోడ్లో భగత్సింగ్జీ గార్డెన్లో నీలేశ్ గోసాయ్ అనే యువకుడు తల్లి జ్యోతిబెన్ గోసాయ్ (48)తో కలిసి నివసిస్తున్నాడు. ఏదో విషయమై తల్లితో గొడవపడి, ఆమె గొంతు నులిమి హత్య చేశాడు. ఆ తర్వాత ‘సారీ అమ్మ.. నిన్ను చంపేశా.. నిన్ను మిస్ అవుతున్నాను.. నా జీవితాన్ని కోల్పోయాను.. ఓం శాంతి’ అని ఇన్స్టాలో పోస్టులు పెట్టాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.